నగదు కొరత, పీఎన్బీ స్కాంపై చర్యలేవీ?: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పై స్థాయీ సంఘం ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ మంగళవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటలపాటు స్థాయీ సంఘం సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
2016, నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇప్పటివరకు ఎంత నగదు తిరిగొచ్చిందో లెక్కలు చెప్పాలని స్థాయీ సంఘం సభ్యులు ఆయనను ఆదేశించారు. అలాగే, దేశాన్ని కుదిపేసిన పీఎన్బీ కుంభకోణంపైనా ఆయన ప్రశ్నించారు.

ఇన్నేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని స్థాయీ సంఘం నిలదీశారు. ఏటీఎంలలో నగదు ఎందుకు సరిగా ఉంచలేకపోతున్నారని ప్రశ్నించారు. నగదు కొరతకు ఎవరు కారణం? అని నిలదీశారు.
ఈ ప్రశ్నలపై స్పందించిన పటేల్ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడగలమనే విశ్వాసం ఉందని చెప్పారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ను అమలు చేసిన తర్వాత నిరర్థక ఆస్తుల సమస్య విషయంలో పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు.
కాగా, స్థాయీ సంఘం ప్రశ్నలన్నింటికీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తానని ఉర్జిత్ పటేల్ తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తదుపరి సమావేశం జూన్ 19న జరుగుతుంది. ఈ సమావేశంలో ఆర్బీఐ ప్రతినిథి పాల్గొంటారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications