UPI Payments: డిజిటల్ చెల్లింపుల్లో 80 శాతం యూపీఐ పేమెంట్సే..

డిజిటల్ చెల్లింపుల్లో UPI వాటా 2023లో 80 శాతానికి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.ముంబైలోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ పేమెంట్స్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. "మా పేమెంట్ సిస్టమ్స్ యొక్క ఫ్లాగ్‌షిప్ 'యూపీఐ' భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థ గురించి ఎక్కువగా ఎదుగుతోంది" అని అన్నారు.

స్థూల స్థాయిలో యూపీఐ లావాదేవీల పరిమాణం 2017లో 43 కోట్ల నుంచి 2023లో 11,761 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. మార్చి 1, 2023 నుండి జనవరి 31, 2024 మధ్యకాలంలో దాదాపు 6.65 కోట్ల మంది యూపీఐ వినియోగదారులు పెరిగినట్లు చెప్పారు. భారత్‌లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు 162 నుంచి పెరిగినట్లు వివరించారు. 12 ఏళ్లలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని గుర్తు చేశారు.

RBI Governor Shaktikanta Das said that 80 percent of digital payments are UPI payments

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం వాటా 40 శాతం ఉందన్నారు. 2012-13లో 162 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగ్గా... 2023-24లో ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య 14,726 కోట్లకు పెరిగింది. వ్యాపారులకు వేగవంతమైన ఫండ్ సెటిల్‌మెంట్‌లను ప్రారంభించడానికి 2024లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ల ఇంటర్‌ఆపరబిలిటీని ప్రారంభించాలని భారత సెంట్రల్ బ్యాంక్ భావిస్తున్నట్లు తెలిపారు.

"NPCI భారత్ బిల్‌పే లిమిటెడ్ (NBBL)కి అటువంటి ఇంటర్‌ఆపరబుల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి మేము ఆమోదం తెలిపాము" అని దాస్ చెప్పారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఈ ఇంటర్‌ఆపరబుల్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+