కరెన్సీ నోట్ల గుర్తింపు: కంటి చూపు లేనివారి కోసం ఆర్బీఐ ‘MANI’ యాప్
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కంటి చూపు సరిగా లేని వారి కోసం ఒక ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టింది. MANI(మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటీఫైయర్) అనే పేరుతో యాప్ను రూపొందించింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ యాప్ను ప్రారంభించారు.
ఈ యాప్ సాయంతో కంటిచూపు లేని వారు సులువుగా నోట్లను గుర్తించే అవకాశం ఉంది. ఒకసారి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. ఈ యాప్ ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులు ఉచితంగానే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు

ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని అధికారులు వివరించారు. అయితే, ఈ యాప్ కరెన్సీ నోటు అసలుదా? నకిలీదా? అనే విషయాన్ని మాత్రం తేల్చలేదని వెల్లడించారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తను నోట్లను రిజర్వు బ్యాంక్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్లలో మార్పులు చేసి 2016 నవంబర్లో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మొదట రూ. 2000, రూ. 500 నోట్లను, ఆ తర్వాత రూ. 100, రూ. 50, రూ. 10, తాజాగా రూ. 20నోట్లను విడుదల చేసింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications