దేనికైనా రెఢీ, ఎలాంటి పొరపాటు జరగలేదు: ప్రతాప్రెడ్డి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైద్య చికిత్సలలో ఎలాంటి పొరపాటు లేదని, ఆమె మరణంపై విచారణకు సిద్దమని అపోలో హస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్రెడ్డి ప్రకటించారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైద్య చికిత్సలలో ఎలాంటి పొరపాటు లేదని, ఆమె మరణంపై విచారణకు సిద్దమని అపోలో హస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్రెడ్డి ప్రకటించారు.
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలిత 2016 సెప్టెంబర్లో హఠాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆపోలో ఆసుపత్రికి తరలించారు. 76 రోజులపాటు ఆమెకు ఈ ఆసుపత్రిలో చికిత్సలు అందించారు.

ఆమె మృతిపై అనేక అనుమానాలున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఆమె మృతిలో అనుమానం ఉందని, దీని గురించి న్యాయ విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం డిమాండ్ చేశారు.
జయలలిత మరణంపై ఎలాంటి విచారణ జరిపినా దానిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. జయలలితకు అందించిన చికిత్సలలో ఎటువంటి పొరపాటు జరగలేదన్నారు. ఆమె చికిత్సలలో కూడ ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications