మోడీపై ప్రశ్నకు జర్నలిస్టుకు స్వామీజీ చెంపదెబ్బ
జబల్పూర్: నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్న వేసినందుకు స్వామి స్వరూపానంద సరస్వతి ఓ జర్నలిస్టు చెంప చెల్లుమనిపించారు. పైగా తన చర్యను సమర్థించుకున్నారు. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నారు కూడా. మోడీపై ప్రశ్నలు వేస్తున్న సమయంలో జర్నలిస్టును స్వామీజి కొట్టిన దృశ్యం కెమెరాలకు చిక్కింది.
జర్నలిస్టును కొట్టినందుకు ఆ 90 ఏళ్ల స్వామీజి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ గురించి పదే పదే అడుగుతుండడంతో తాను జర్నలిస్టును కొట్టానని, ప్రజల ప్రశంసల ద్వారానో, విమర్శల ద్వారానో నరేంద్ర మోడీ పేరు నోళ్లలో నానేలా వ్యవహరిస్తున్నారని స్వామీజీ అన్నారు.

రాజకీయ ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పబోనని ఆ స్వామీజీ చెప్పారు. అయినా వినకుండా అతను ప్రశ్నలు సంధిస్తుండడంతో స్వామీజీ కోపం కట్టలు తెంచుకుంది. స్వరూపానంద సరస్వతి ద్వారక శంకరచార్యగా ఉన్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు కూడా.
ఈ సంఘటనపై కార్యక్రమ నిర్వాహకులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు స్వామీజి ఇష్టపడరని వారన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications