Yamuna: మళ్లీ ఉగ్రరూపం దాల్చిన యమునా.. అప్రమత్తమైన ఢిల్లీ అధికారులు..
యమునా నది మళ్లీ పెరిగింది. ఢిల్లీ వద్ద యమునా నది నీటి మట్టం మళ్లీ 206 మీటర్లకు చేరిందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద 206.01 మీటర్ల ఎత్తులో ప్రవచహిస్తోంది. సాయంత్రానికి 4 నది 206.7 మీటర్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీడబ్ల్యూసీ సూచించింది. శనివారం రాత్రి 10 గంటల వరకు యమునా నది గరిష్ట స్థాయి 205.02 మీటర్ల వద్ద ఉంది.గంటల వ్యవధిలోనే 206 మీటర్లకు చేరింది.
హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి విడుదలైన నీరు దాదాపు 36 గంటల తర్వాత దేశ రాజధానికి చేరుకుంది. మరోవైపు బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. "పరిస్థితి ఆందోళనకు దారితీసింది. నివాసితుల భద్రత కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని తీసుకుంటుంది" అని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి చెప్పారు. పరిస్థితిని పరిష్కరించడానికి, అధికారులు సెంట్రల్ జిల్లా, తూర్పు జిల్లా లేదా యమునా బజార్, యమునా ఖాదర్ వంటి ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఘజియాబాద్లో గత 48 గంటల్లో హిండన్ నది ప్రవాహం 10,575 క్యూసెక్కుల మేర పెరిగి, రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ సమీపంలోని ఎగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో శుక్రవారం సాయంత్రం నుండి కనీసం 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా ఎగువన ఉన్న రాష్ట్రాలు భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో జూలై 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.












Click it and Unblock the Notifications