"అజిత్ పవార్ విమాన ప్రమాదం పెద్ద కుట్ర.. సాక్ష్యం ఇదే.."
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ ఘటనపై తక్షణమే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని.. అది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కీలక విషయాలను బహిర్గతం చేశారు. అజిత్ పవార్ వాస్తవానికి జనవరి 27 రాత్రి కారులో పుణే వెళ్లాల్సి ఉందని.. కానీ ఓ నాయకుడి ఒత్తిడి వల్ల ప్రయాణం వాయిదా పడిందన్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఘటన జరిగిన రోజు విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్ పైనా రోహిత్ పవార్ పలు ప్రశ్నలు సంధించారు. విమానాన్ని నడపాల్సిన రెగ్యులర్ పైలట్ లను కాదని.. గతంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న కెప్టెన్ సుమిత్ కపూర్ ను చివరి నిమిషంలో ఎందుకు నియమించారని ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో మద్యం సేవించినందుకు పైలట్ సుమిత్ ను మూడేళ్లు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారం ఉండదని.. అందువల్ల అమెరికాకు చెందిన NTSB లేదా బ్రిటన్ కు చెందిన AAIB వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జనవరి 28, 2026న ముంబై నుండి బారామతి విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మరణించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications