చంద్రుడిపై నడిచిన రోవర్ ప్రగ్యాన్: మేడిన్ ఇండియా అంటూ ఇస్రో ట్వీట్
హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయాణంపై తాజాగా మరో సమాచారం ఇచ్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO). చంద్రుడిపైకి ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన దాదాపు నాలుగు గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్(ప్రగ్యాన్) రోవర్ సాఫీగా బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇస్రో సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి కోసం భారత్లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై నడిచింది' అంటూ ఇస్రో గురువారం ట్వీట్ చేసింది.

ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం రోవర్ తన అధ్యయనం మొదలుపెట్టింది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయనుంది.
'
First photo of Rover coming out of the lander on the ramp. pic.twitter.com/0ouhMk8MbR
— Pawan K Goenka (@GoenkaPk) August 23, 2023
కాగా, చంద్రుడిపైకి అనేక దేశాలు ప్రయోగాలు చేసినా.. మూడు మాత్రమే విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకుముందు సోవియేట్ యూనియన్, అమెరికా, చైనాలు చంద్రుడిపై అడుగుపెట్టాయి. అయితే, ఆ మూడూ భూమికి కనిపించే వైపు చంద్రుడిపై అడుగుపెట్టగా.. మన చంద్రయాన్ మాత్రం ఇప్పటిదాకా మానవాళికి కనిపించని దక్షిణధృవాన్ని ముద్దాడింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 24, 2023
Chandrayaan-3 ROVER:
Made in India 🇮🇳
Made for the MOON🌖!
The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !
More updates soon.#Chandrayaan_3#Ch3
నేడు విజయవంతమైన చంద్రయాన్-3కి అంతకుముందు నిర్వహించిన చంద్రయాన్-1, 2 ప్రయోగాలు ప్రేరకాలుగా నిలిచాయి. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలు భారత్పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంపైకి రష్యా కూడా చంద్రయాన్-3 సమయంలో ప్రయోగించినప్పటికీ.. ఆ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications