కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు: ఇద్దరు మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సేల్దా - అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ డివిజన్లోని దెహాత్ జిల్లాలో ఈ రోజు వేకువజామున ఎక్స్ప్రెస్ రైలులోను 14 బోగీలు పట్టాలు తప్పాయి.
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సేల్దా - అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ డివిజన్లోని దెహాత్ జిల్లాలో ఈ రోజు వేకువజామున ఎక్స్ప్రెస్ రైలులోను 14 బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విషయం తెలియగానే సహాయక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంది. బోగీల నుంచి ప్రయాణీకులను బయటకు తీస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
విచారణ జరిపిస్తాం: కేంద్రమంత్రి సురేష్ ప్రభు
ప్రమాద ఘటన పైన కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందించారు. తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నానని చెప్పారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు చేపట్టాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన చెప్పారు. గాయపడ్డ వారికి చికిత్స అందించాలని సూచించానన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశిస్తామన్నారు.
#WATCH 14 coaches of Train no 12988 #AjmerSaeldah express derail near Roora (Kanpur, Uttar Pradesh). Several injured. pic.twitter.com/s3VRDUavlu
— ANI UP (@ANINewsUP) December 28, 2016
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications