శారదా స్కాం: నళిని చిదంబరంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/చెన్నై: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో మరోసారి మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుటుంబానికి షాక్ తగిలింది. ఈ స్కాంలో పి చిదంబరం భార్య నళినికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఆమెకు సమన్లు జారీ చేసింది.
శారద స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇటీవల రూపొందించిన ఆరో అనుబంధ ఛార్జ్షీట్లో నళిని పేరును చేర్చింది. అయితే ఈ కేసులో నళినిని సాక్షి లేదా నిందితురాలిగా కాకుండా.. వివాదాస్పద ఛానల్ ఒప్పందం గురించి తెలిసిన రహస్య వ్యక్తిగా పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకే ఆమెకు సమన్లు జారీ చేశారు.

2013లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన శారద చిట్ఫండ్ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ఇన్వెస్టర్ల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శారదా చిట్ఫండ్ గ్రూప్ తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు అరెస్టై, బెయిల్పై విడుదలయ్యారు. ఇంకా వారిపై విచారణ కొనసాగుతోంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications