జయ మృతిపై నోరు తెరిచిన శశికళ: ఏమన్నారు?
జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలపై శశికళ తొలిసారి పెదవి విప్పారు. పన్నీర్ సెల్వం ప్రకటనపై కూడా ఆమె స్పందించారు.
చెన్నై: దివంగత నేత జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ ఎట్టకేలకు నోరు తెరిచారు. తొలిసారి ఆమె జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చారు. సిఎన్ఎన్ - న్యూస్ 18 చానెల్తో ఆమె ఆ విషయంపై మాట్లాడారు.
అమ్మతో కలిసి తనాను 33 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నానని, ఆమెను తాను ఎంత బాగా చూసుకున్నానో బాడీగార్డులకు తెలుసునని, జయ మృతిపై కావాలనే వందతులు వస్తున్నారని, ఎవరో వీటిని సృష్టిస్తున్నారని శశికళ అన్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు కూడా తాను ఆమెతో ఉండి జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలిపారు. వైద్యులే దానికి సాక్షులని చెప్పారు.

ఆ విషయాన్ని తాను అంతరాత్మ సాక్షిగా చెబుతున్నానని, అమ్మ మరణం తర్వాత తాను చాలా బాధనూ ఆవేదనను అనుభవించానని అన్నారు. జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తామనే పన్నీర్ సెల్వం వ్యాఖ్యలపై కూడా శశికళ స్పందించారు.
పన్నీర్ సెల్వం ప్రకటన తనను చాలా బాధించిందని, తమకు ఏ విధమైన భయమూ లేదని, తాము ఎయిమ్స్ నుంచీ లండన్ నుంచీ సింగపూర్ నుంచీ వైద్యులను పిలిపించామని చెప్పారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. డిఎంకె ప్రమేయం వల్లనే తమిళనాడులో సంక్షోభం తలెత్తిందని ఆమె విమర్శించారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications