వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ఏం చేస్తారు?: శశికళకే ఎక్కువ ఛాన్స్, పన్నీరు వైపు వారి మొగ్గు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే, తనకు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక చీఫ్ శశికళలు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు విజ్ఞప్తులు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే, తనకు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక చీఫ్ శశికళలు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు విజ్ఞప్తులు చేశారు.

దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? అటార్నీ జనరల్ నిర్ణయం ఏమిటి? నిబంధనలు ఎవరికి అనుగుణంగా ఉన్నాయి? గవర్నర్ ముందు ఉన్న ఆప్షన్లు ఏమిటి.. ఆయన ఎలా ముందుకు వెళ్తారనే చర్చ జరుగుతోంది.

శశికళ వద్ద బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకు రా: డీజీపీకి పన్నీరుశశికళ వద్ద బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకు రా: డీజీపీకి పన్నీరు

పరిస్థితులు చూస్తుంటే శశికళకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు శశికళ క్యాంపు నుంచి శశికళ వైపు మొగ్గు చూపారు. అయితే, మెజార్టీ మాత్రం శశికళ వెంటనే ఉందని అంటున్నారు.

Sasikala stakes claim to form govt in TN

కొందరు తక్కువ అయినప్పటికీ.. శశికళకు సీఎం పీఠం ఛాన్స్ ఉందని తెలిస్తే వారు తిరిగి పన్నీరు క్యాంప్ నుంచి శశికళ వైపు వస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆమె తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారు. దీనినే ఆమె గవర్నర్ ముందు ఉంచారు. దీంతో ఇప్పుడు శశికళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

శశికళకు షాక్ మీద షాక్: విచారణకు సుప్రీం ఓకే, క్యాంప్ రాజకీయాలపై..శశికళకు షాక్ మీద షాక్: విచారణకు సుప్రీం ఓకే, క్యాంప్ రాజకీయాలపై..

అయితే, శశికళకు సొంత పార్టీలో ఎక్కువ వ్యతిరేకత, రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది. విపక్షాలు కూడా పన్నీరుకు మద్దతిస్తున్నాయి. పైగా జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలు. ఈ కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పనుంది. ఇది కూడా ఆమెకు అఢ్డంకి అవుతోంది. అయితే, కేసులు తదితరాలను చూపించి. ఎమ్మెల్యేల బలం ఉన్న శశికళను పక్కన పెట్టడం సరికాదంటున్నారు.

గవర్నరే కీలకం: పన్నీరు, శశికళ బలాబలాలివే! తమిళనాడులో ఏం జరగొచ్చంటే..? గవర్నరే కీలకం: పన్నీరు, శశికళ బలాబలాలివే! తమిళనాడులో ఏం జరగొచ్చంటే..?

మరోవైపు, ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్ సెల్వంకే మద్దతు తెలిపారు. త‌మిళ‌నాడుకు నాయ‌క‌త్వం వహించేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌విలో కొన‌సాగాలా? అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు.

సీఎంవో తమిళనాడు.. పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్ సెల్వం ట్విటర్‌ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.

English summary
Among chants of long live Chinamma, Sasikala Natrajan reached the Raj Bhavan in Chennai to meet with Governor Vidyasagar Rao. During the meeting Sasikala told Rao that she should be invited to form the government in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X