విజయ్ మాల్యాను నిలదీసిను సుప్రీం కోర్టు
రుణాల ఎగవేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు బుధవారం నాడు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: రుణాల ఎగవేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు బుధవారం నాడు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. రూ.9 వేల కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ఆ సొమ్మును రాబట్టుకునేందుకు కేసు దాఖలు చేసింది.
డియాజియో నుంచి స్వీకరించిన రూ.273.32 కోట్ల డిపాజిట్ గురించి మూడు వారాల్లోగా వివరించాలని మాల్యాను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రూ.273.32 కోట్లను మాల్యా తన కుమారుడికి బదిలీ చేయడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
లండన్ పలాయనం చిత్తగించిన మాల్యాను తిరిగి భారతదేశానికి రప్పించాలని, రుణ బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును అంతకుముందు కోరింది.