సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్
హైదరాబాద్: ఆధార్ కార్డుతో ఓటరు అనుసంధానం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎటువంటి అనుసంధాన ప్రక్రియ జరగరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇక మీదట ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొవద్దని, అలాగే ఫీడింగ్, సీడింగ్ కూడా చేయొద్దని ఎన్నికల కమిషన తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు తప్ప మరే పథకానికి ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లు వ్యక్తిగతంగా తమ ఆధార్ కార్డులను ఓటర్ కార్డు కాపీలతో దరఖాస్తు చేసుకున్నారు. మరో 10 కోట్ల మంది దరఖాస్తులు వేరే పద్దతుల్లో అందాయని, ఆన్లైన్లో 3 కోట్ల మంది అనుసంధానానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవలే తెలంగాణలో పెద్ద ఎత్తున ఆధార్ అనుసంధానాన్ని చేపట్టారు. ఇప్పటికే 65 శాతానికి పైగా అనుసంధానం పూర్తికాగా, ఈసీ ఉత్తర్వులతో ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచినట్లయింది. వేర్వేరు రాష్ట్రాలు లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండేవారిని గుర్తించి వాటిని ఏరివేసేందుకు ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కార్యక్రమాన్ని చేపట్టారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications