అమెరికా ఇవిగో ఆధారాలు : ఎఫ్-16 కూల్చలేదనే కథనాలపై భారత్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చలేదని అమెరికా మీడియా కోడై కూస్తోంది. దీంతో భారత వాయుసేన స్పందించి .. తగు ఆధారాలను వివరించింది. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ -16 విమానాన్ని భారత మిగ్-21 విమానం కూల్చివేసిందని వాయుసేన వైస్ అడ్మిరల్ ఆర్జీవీ కపూర్ పేర్కొన్నారు.

ఆధారాలివిగో ..
యుద్ధ విమానం కూల్చివేసిన సమయంలో ఎఫ్-16 రాడార్ డిజిటల్ సంతకం తమ వద్ద నమోదైందని పేర్కొన్నారు. ఆ విమానం మాత్రమే ప్రయోగించగలిగిన ఆమ్రామ్ క్షిపణి శకలాలను మీడియా ముందుంచామని తెలిపారు. ఫిబ్రవరి 27న రెండు విమానాల నుంచి పైలెట్లు బయటకు ఎజెక్టు కావడం కూడా రికార్డైందని తెలిపారు. వాటిలో ఒకటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడిపిన భారత యుద్ధ విమానం మిగ్ -21 అని, మరొకటి పాక్ ఎఫ్ -16 అని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications