ఈమె గాంధీ మునిమనవరాలే, కానీ.: ఏం చేస్తుందో తెలుసా?
న్యూయార్క్: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ అసలైన వారసుల గురించి చాలా మందికి తెలియదు. గోపాలకృష్ణ గాంధీ.. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, విపక్షాల అభ్యర్థిగా పోటీ చేయడంతో వెలుగులోకి వచ్చారు. అయితే, ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.ఈయన మహాత్మాగాంధీ మనవడు.

సోషల్ మీడియాలో..
కాగా, తాజాగా, మహాత్మాగాంధీ ముని మనవరాలి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పేరు మేధా గాంధీ. గాంధీ పెద్ద కుమారుడైన హరిలాల్ గాంధీ కుమారుడు కాంతిలాల్ గాంధీ కుమార్తే ఈ మేధా గాంధీ.
Recommended Video


అమెరికాలో...
గాంధీ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబీకుల్లో కొందరు అమెరికాలో స్థిరపడ్డారు.మేధా అమెరికాలోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఓ పక్క డీజేగా పనిచేస్తూ మరో పక్క షోలు కూడా నిర్వహిస్తోంది.

రియాలిటీ షోలు..
ఉన్నత విద్యను అభ్యసించిన మేధా గాంధీ.. అమెరికాలో పలు టీవీ రియాలిటీ షోలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ‘డేవ్ అండ్ షో', ‘మ్యాటీ ఇన్ ది మార్నింగ్ షో'.. వంటి పాపులర్ కార్యక్రమాలను మేధా గాంధీ ప్రొడ్యూస్ చేశారు.

నెటిజన్లు ఇలా..
అయితే ఆమె ఇటీవల తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆగస్టు 15న భారత్ 71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుందని ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్ర సాధించిన గాంధీ మునిమనవరాలు ఇలాంటి దుస్తులు వేసుకోవడం సబబు కాదంటూ పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications