బీహార్లోని అరా రైల్వే స్టేషన్లో కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి !
బీహార్లోని అరా రైల్వే స్టేషన్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 3,4 మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జిపై ఒక వ్యక్తి.. ఒక యువతిపై, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు శబ్దం విన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ముగ్గురు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కడానికి తన తండ్రితో కలిసి స్టేషన్కు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో గన్తో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ స్టేషన్లోని 3, 4 ప్లాట్ ఫామ్ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జిపై.. ముగ్గురు వ్యక్తులు తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు. ప్రత్యక్ష సాక్ చెప్పిన వివరాల మేరకు.. మొదట యువతిని, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్టు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి వయస్సు 23-24 సంవత్సరాల మధ్య ఉంటుందని.. అమ్మాయి వయస్సు 16-17 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
Shocking News Coming From #Bihar: Triple murder at Ara railway station Young man shot dead father and daughter, then he shot himself.#Arrah, Bihar, where a 23-24-year-old man shot dead a 16-17-year-old girl and her father before taking his own life. pic.twitter.com/fjfcHbov3B
— Siraj Noorani (@sirajnoorani) March 26, 2025
మరోవైపు ఆర్పీఎఫ్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ పాండా మాత్రం ఈ సంఘటన ప్లాట్ఫామ్ నెంబర్ 2లో జరిగిందని తెలిపారు. నిందితుడు టార్గెట్ చేసి మరీ కాల్పులు జరపడం.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకోవడం చూస్తుంటే ప్రేమ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి అమన్ కుమార్ గా తెలిపారు. యువతి పేరు జియా కుమారి, ఆమె తండ్రి పేరు అనిల్ సిన్హాగా చెప్పారు.
#WATCH | Arrah, Bihar: RPF Senior Commandant Prakash Panda says, "... Three people have died. The accused, Aman Kumar, a 24-year-old man, a resident of Bhojpur shot dead Jiya Kumari and her father Anil Sinha. He later shot himself. We are investigating... We will make… https://t.co/xDfhWnyN5j pic.twitter.com/vPWQgxXYzr
— ANI (@ANI) March 26, 2025
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications