48 రోజులు గ్యాంగ్‌రేప్.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు కూడా..!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో 28 ఏళ్ల మహిళ అఘాయిత్యానికి గురైంది. నలుగురు వ్యక్తులు తనను 48 రోజుల పాటు కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. అయితే మరింత విషాదకరంగా తాను ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తర్వాత ఇద్దరు విచారణాధికారులు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై చర్యకు బదులు పోలీసుల అఘాయిత్యం!
బులంద్‌షహర్‌లోని ఖుర్జా ప్రాంతానికి చెందిన ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించింది. తన ఫిర్యాదుపై చర్య తీసుకోవడానికి బదులుగా, ఆ ఇద్దరు ఎస్సైలు తన నుంచి రూ.50,000 వసూలు చేశారని ఆమె పేర్కొంది. అంతే కాకుండా.. వారు తన భర్తను అదుపులోకి తీసుకుని వేధించారని.. వారి డిమాండ్లకు అంగీకరించమని బలవంతం చేయడానికి తన భర్తపై తప్పు కేసు పెడతామని బెదిరించారని మహిళ ఆరోపించింది. మహిళ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఎస్సైలను విచారణ పెండింగ్‌లో ఉంచి తక్షణమే సస్పెండ్ చేసినట్లు బులంద్‌షహర్‌ ఎస్ఎస్‌పి దినేష్ కుమార్ వెల్లడించారు.

Shocking Ordeal Woman Abducted and Abused for 48 Days in Uttar Pradesh

మహిళ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇవే..
గత నవంబర్‌లో నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని.. ఉత్తరప్రదేశ్ అంతటా వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె వెల్లడించింది. కిడ్నాప్ సమయంలో తనను బలవంతంగా మతమార్పిడి చేయాలని ప్రయత్నించారని కూడా ఆమె పేర్కొంది. నిందితుల్లో ప్రధాన వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడని, ఆ తర్వాత మిగిలిన ముగ్గురిని పరిచయం చేశాడని ఆమె వివరించింది. తాను పోలీసులను ఆశ్రయించినప్పుడు, ఒక పోలీసు అధికారి తనను తన ప్రైవేట్ నివాసానికి పిలిపించి, రెండు రోజుల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, మరొకరు న్యాయం చేస్తామని చెప్పి రూ. 50,000 తీసుకున్నాడని ఆమె ఆరోపించింది.

దర్యాప్తులో పోలీసుల వాదన
పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో ఫిర్యాదుదారురాలు పలుమార్లు తన వాదనను మార్చిందని చెబుతున్నారు. మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఎస్ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితుల ప్రమేయంపై అనుమానం ఉందని.. వారి కాల్ డేటా, మొబైల్ లొకేషన్లు మహిళ పేర్కొన్న నేర ప్రదేశాలలో లేవని దర్యాప్తులో తేలిందని ఎస్ఎస్పీ వివరించారు. ఇద్దరు సస్పెండైన అధికారులపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్రమైనవైనప్పటికీ.. "ఆ అధికారులపై ప్రత్యేకంగా పేరు పెట్టి అధికారిక ఫిర్యాదు ఇవ్వడానికి మహిళ ఇప్పుడు సుముఖంగా లేదు. దీనివల్ల అంతర్గత విచారణ క్లిష్టంగా మారింది, అయినప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతుంది" అని ఎస్ఎస్పీ తెలిపారు.

జాతీయ మహిళా కమిషన్ జోక్యం
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు సహా అందరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లో వివరణాత్మక నివేదికను సమర్పించాలని కూడా జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+