ప్రియుడు మోసం చేస్తే నర్సును నిలువునా ముంచేసిన ఎస్ఐ, కడుపు చేసి కాలక్షేపం, అసలు ఏం జరిగిందంటే?
చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చూస్తూ యువతి చాలా సంతోషంగా ఉంటోంది. అదే సమయంలో ప్రియుడు మోసం చేశాడని ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతికి ఎస్ఐ పరిచయం అయ్యాడు. అంతే యువతిని వలలో వేపుకున్న ఎస్ఐ ఆమెతో ఎంజాయ్ చేశాడు. యువతి గర్భవతి అయ్యింది.
యువతి అబార్షన్ చేయించిన ఎస్ఐ నువ్వు మర్యాదగా ఎవరినైనా పెళ్లి చేసుకో ? నేను ఇప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తాను అంటూ ఎదురుతిరిగాడు. తనను ఎస్ఐ మోసం చేశాడని ఆ యువతి ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతే రాత్రి నిద్రమాత్రలు మింగిన యువతి మూడు పేజీల డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో కలకలం రేపింది.

కన్యాకుమారీ టూ కేరళ
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కుజితురై ముక్కోడు ప్రాంతానికి చెందిన జోస్పిన్ (31) అనే యువతి నర్సింగ్ పూర్తి చేసింది. కన్యాకుమారి నుంచి కేరళలోని తిరువనంతపురం చేరుకున్న జోస్పిన్ అక్కడ ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తూ చాలా సంతోషంగా గడిపేది.

మోసం చేసిన ప్రియుడు
జోస్పిన్ కు మోక్ డోనాల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వలవేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువకుడు జోస్పిన్ కు మాయమాటలు చెప్పాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మిన జోస్పిన్ అతను ఏమి చెప్పినా సరే అని తలఊపేది. అంతే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు జోస్పిన్ తో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర లక్షల రూపాయల డబ్బులు, బంగారు నగలు తీసుకుని మోసం చేసి మాయం అయ్యాడు.

మీరే న్యాయం చెయ్యలి
డబ్బులు, నగలు తీసుకుని మోసం చేసిన ప్రియుడి మీద ఫిర్యాదు చెయ్యడానికి జోస్పిన్ బలూకర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్ఐగా పని చేస్తున్న సుశీంద్రన్ అలియాస్ సుందరలింగం (33) ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన జోస్పిన్ మీద కన్ను వేశాడు. నీకు న్యాయం చేస్తానని, నువ్వు భయపడకూడదని, ప్రియుడు మోసం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎస్ఐ సుశీంద్రన్ జోస్పిన్ కు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చేశాడు. జోస్పిన్ ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో విచారణ పేరుతో నేరుగా యువతి ఇంటికి వెళ్లిన ఎస్ఐ సుశీంద్రన్ ఆమెతో ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశాడు.

నేను ఎస్ఐ, నువ్వు జస్ట్ నర్సు మాత్రమే
ఎస్ఐ సుశీంద్రన్ కారణంగా జోస్పిన్ గర్భవతి అయ్యింది. తాను గర్భతి అయ్యానని, పెళ్లి చేసుకోవాలని జోస్పిన్ చెప్పడంతో ఎస్ఐ సుశీంద్రన్ షాక్ కు గురైనాడు. తనకు కొన్ని ఇంటి సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తీరిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని, ప్రస్తుతానికి నువ్వు అబార్షన్ చేసుకోవాలని జోస్పిన్ కు ఎస్ఐ సుశీంద్రన్ మాయమాటలు చెప్పాడు. తరువాత కన్యాకుమారిలోని ఓ ఆసుపత్రికి జోస్పిన్ ను తీసుకెళ్లి అబార్షన్ చేయించిన ఎస్ఐ సుశీంద్రన్ ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

కలెక్టర్, ఎస్పీకి చెప్పినా దిక్కులేదు
ఎస్ఐ సుశీంద్రన్ మోసం చెయ్యడంతో జోస్పిన్ షాక్ కు గురై ఇటీవల కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఐ సుశీంద్రన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ ఆఫీసు ముందు జోస్పిన్ ధర్యా చేసింది. ఆ సమయంలో మధర్ స్వచ్చంద సంస్థ జోస్పిన్ కు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అధికారులు ఎస్ఐ సుశీంద్రన్ ను వేరే పోలీస్ స్టేషన్ కు బదిలి చేసి అతని మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు.
Recommended Video

డెత్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగేసింది
తనను మోసం చేసిన ఎస్ఐ సుశీంద్రన్ మీద ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని కలత చెందిన జోస్పిన్ తన ఆత్మహత్యకు ఎస్ఐ కారణం అంటూ మూడు పేజీల డెత్ నోట్ రాసి రాత్రి ఇంట్లో మోతాదుకుమించి నిద్రమాత్రలు మింగేసింది. ఇంట్లో స్పృహలేని స్థితిలో పడి ఉన్న జోస్పిన్ ను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తక్కలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోస్పిన్ ను మోసం చేసి తప్పించుకున్న ఎస్ఐ సుశీంద్రన్ ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మధర్ స్వచ్చంద సంస్థతో పాటు కన్యాకుమారిలోని పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. జోస్పిన్ ను మోసం చేసింది ఎస్ఐ కాబట్టి ఆమెకు పోలీసు అధికారులు న్యాయం చెయ్యడంలేదని ఆరోపిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications