పాపం అంబాని, ఆదానీలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్
భారతదేశంలోని శ్రీమంతులకు ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ రెడ్ కార్పెట్ వేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. అంబానీ, అదానీలతోపాటు అత్యంత సంపన్నులకు సంబంధించి రూ 16 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని, కానీ రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేయలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. హాసన్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. రైతుల రుణమాఫీ హామీ పత్రాలపై ఇప్పటికే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సంతకాలు చేశారని సీఎం సిద్దరామయ్య అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలోని రైతులు అందరికి కలిపి రూ. 76 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతులకు చెందిన రూ 76 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ మాత్రం అంబానీ, అదానీలకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని సీఎ: సిద్దరామయ్య ఆరోపించారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ చేస్తే పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఉచిత హామీలను ఇప్పటికే అమలు చేస్తుందని, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ప్రకటించిన 25 ఉచిత హామీలను అమలు చేసి మీ కుటుంబాల అకౌంట్ లో రూ. ఒక లక్షల రూపాయలు జమ చేస్తామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
హాసన్ లో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ కుటుంబ రాజకీయాలకు కాస్త విశ్రాంతినిచ్చి ఈసారి హసన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సీఎం సిద్దరామయ్య ఆజిల్లా ప్రజలకు మనవి చేశారు. గతంలో మోదీ హామీలపై మాటల తూటాలు పేల్చిన మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పుడు ఆయన తీరు మార్చుకున్నారని, తనకు మోదీకి విడదీయరాని అనుబంధం ఉందని దేవేగౌడ చోబుతున్నారని, మీ సంబంధం చాలా బాగుంటే కొబ్బరి పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వకూడదు అని సీఎం సిద్దరామయ్య మాజీ ప్రధాని దేవేగౌడను ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మీద మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
-
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications