Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామాకు సిద్ధమైన సీఎం!, కానీ కండిషన్స్ ఇవే!

ప్రస్తుతం కర్ణాటక రాజకీయంలో 'కుర్చీలాట' 'సిలిండర్ మంట' అంశాలు అత్యంత వేడిని పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూనే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల యుద్ధాన్ని ప్రకటించారు. కర్ణాటక రాజకీయాల్లో ఉగాది తర్వాత పెను మార్పులు సంభవిస్తాయన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిందేనంటూ సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న తరుణంలో, ఆయన తనదైన శైలిలో స్పందించారు.

"ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని పార్టీ అధిష్ఠానం ఒక్క మాట చెబితే చాలు.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ క్షణమే తప్పుకుంటాను" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. తన నియోజకవర్గం పిళ్లాహళ్లి హెలిప్యాడ్ వద్ద మాట్లాడిన ఆయన, పార్టీ పట్ల తనకున్న విధేయతను చాటుకుంటూనే, బంతిని హైకమాండ్ కోర్టులోకి విసిరారు.

Siddaramaiah Ready to Quit as CM if High Command Asks Slams PM Modi Over LPG Price Hike and Foreign Policy

మరో రెండుసార్లు కూడా..

అయితే, కేవలం పదవిపై వివరణతోనే సరిపెట్టకుండా సిద్ధరామయ్య తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా తనకున్న రికార్డును గుర్తు చేస్తూ, అవకాశం వస్తే మరో రెండుసార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే సత్తా తనకుందని పరోక్షంగా తన పట్టును చాటుకున్నారు. అధినాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూనే, ప్రస్తుతానికి తనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానన్న ధీమాను ఆయన మాటల్లో వ్యక్తపరిచారు.

ఇదే క్రమంలో సిద్ధరామయ్య తన విమర్శల బాణాలను నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైకి మళ్లించారు. దేశీయ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వ "తప్పుడు విదేశాంగ విధానాలే" కారణమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "భారతదేశంలోని లక్షలాది సామాన్య కుటుంబాలపై కేంద్రం భారమైన భారాన్ని మోపుతోంది" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ఈ సంక్షోభం కేవలం యాదృచ్ఛికం కాదని, దౌత్య పరమైన లొంగుబాటుకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.

తక్షణమే రాజీనామా చేయాలని..

ప్రధాని మోదీ అమెరికాతో గుడ్డిగా సమన్వయం చేసుకుంటూ, రష్యా- ఇరాన్ వంటి ఇంధన భాగస్వాములతో భారతదేశానికి ఉన్న దశాబ్దాల సంబంధాలను దెబ్బతీశారని సిద్ధరామయ్య విమర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ, వ్యూహాత్మక లోతుల లేకపోవడం వల్లే సామాన్యుడు గ్యాస్ మంటను భరించాల్సి వస్తోందని విశ్లేషించారు. తన దౌత్య సాహసాలకు దేశ ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలో మోదీ వివరించాలని, వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య చేసిన డిమాండ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+