కాంట్రాక్టులు చేసుకుంటున్నా సామాగ్రి రావట్లేదు..! బాంబుపేల్చిన ఎయిర్ ఫోర్స్ ఛీఫ్..!
భారత రక్షణరంగంలో పెను సంచలనం. దేశ రక్షణ కోసం తయారు చేస్తున్న వ్యవస్ధలకు విదేశాల నుంచి రావాల్సిన సామాగ్రి సకాలంలో రావడం లేదని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నప్పుడే అవి రావని తమకు అర్దమైపోతోందంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్న కార్యక్రమంలోనే ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో భారత రక్షణ రంగంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.
రక్షణ శాఖ చేపడుతున్న ప్రధాన రక్షణ కొనుగోళ్ల ప్రాజెక్టులలో జరుగుతు్న జాప్యంపై ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని తమకు తెలుసన్నారు. గడువులు పెద్ద సమస్య అని, తాను ఆలోచించగలిగే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సమయానికి పూర్తి కాలేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దానిని మనం ఎందుకు వాగ్దానం చేయాలని ఆయన ప్రశ్నించారు.

తాను చేసిన ఆరోపణలకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పలు ఉదాహరణలు కూడా చూపారు. ఇందులో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గురించి వెల్లడించారు. 2021 ఫిబ్రవరిలో రూ.48వేల కోట్లకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ జెట్ డెలివరీలు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆర్డర్ చేసిన 83 విమానాలలో ఏదీ డెలివరీ కాలేదన్నారు. వాస్తవానికి తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్ల తొలి డెలివరీ గతేడాది మార్చిలోనే ప్రారంభం కావాల్సి ఉంది.
#WATCH | Delhi: Indian Air Force chief Air Chief Marshal Amar Preet Singh says, "Timeline is a big issue. So, once a timeline is given, not a single project that I can think of has been completed on time. So this is something we have to look at. Why should we promise something… pic.twitter.com/4aJxyuEcLx
— ANI (@ANI) May 29, 2025
ఇలా జరుగుతున్న ఆలస్యం వల్ల అనేక కీలక ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆరోపించారు. ఇందులో తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానం ఉందని, మూడేళ్ల క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసినా ఇప్పటికీ డెలివరీ కాలేదన్నారు. అలాగే తేజస్ ఎంకే2 నమూనా కూడా ఇంకా విడుదల కాలేదన్నారు. ఎంఎంసీఏఏ యుద్ధ విమానం నమూనా కూడా అందుబాటులో లేదన్నారు. కేంద్రం ఆత్మనిర్భర్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తున్న న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications