8వ అంతస్తు నుంచి కిందపడ్డ సాప్ట్ వేర్ ఇంజనీర్, మృతి...?
చెన్నై: చెన్నైలో అనుమానాస్పద స్ధితిలో సాప్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా బిల్డింగ్ పై నుంచి ఎవరైనా కిందకు తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
వేలూరు జిల్లా, రాణీపేటకు చెందిన వేలాండి ఓ రైతు. ఇతని కుమారుడు అరవింద్ (25). ఇతను చెన్నై ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోగల పెరుంగుడిలో ఉన్న ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.

చెన్నైలోని తిరువాన్మియూరు భారతిదాసన్ వీధిలో ఒక అద్దె ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి అరవింద్ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరేందుకు బయటకు వచ్చాడు. ఈలోపు సడన్ గా 8వ అంతస్తు నుంచి కిందపడ్డాడు.
వెంటనే రక్తపు మడుగులో ఉన్న అరవింద్ను అక్కడి వ్యక్తులు 108 అంబులెన్స్లో చెన్నైలోని రాయపేట ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అరవింద్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తురైపాక్కం ఇన్స్పెక్టర్ మహేశ్కుమార్ అరవింద్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications