డాడీకి ఓటేయండి: శతృఘ్ను కూతురు సోనాక్షి సిన్హా
ముంబై: అవినీతి రహిత భారత్ నిర్మాణానికి, దేశంలో మార్పు రావాలని, మార్పును కోరుకుంటున్న వారికి ఇదే సరైన అవకాశమని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అన్నారు. బిజెపి నాయకుడు శతృఘ్ను సిన్హా కూతురైన ఆమె పరోక్షంగా తన తండ్రికి ఓటేయాలని చెప్పారు.
తమ ఓటు హక్కుతో ఈ మార్పును సాధించుకునే సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసే పార్టీకి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తన తండ్రి చెపుతుండేవారని, ఇపుడు ఆయన అలాంటి పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

అందువల్ల దేశ ప్రజలు కూడా మంచి పార్టీ అయిన బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె పిలుపునిచ్చారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా సాహబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే.
నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తారని తాను భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని, తనకిష్టమైన సినిమా పరిశ్రమలోనే కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పారు. శతృఘ్ను సిన్హా రాజకీయాల్లోకి రాక ముందు విజయవంతమైన పలు హిందీ సినిమాల్లో హీరోగా నటించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications