ఎంతకు తెగించార్రా.. కన్నతండ్రిని పాముకాటుతో చంపించి..
డబ్బు కోసం కన్న తండ్రినే చంపించారు ఇద్దరు కొడుకులు. కనిపెంచి పెద్దవాళ్లను చేసిన కన్నతండ్రినే కిరాతకంగా పాము కాటుతో చంపించారు. ఇన్సురెన్స్ డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా పాము కాటుతోనే తమ తండ్రి మరణించాడని చెప్పుకొచ్చారు. కానీ బీమా సంస్థ అధికారులకు కుమారులపై అనుమానం రావడంతో ఎట్టకేలకు నిజం బయటపడింది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా పోతాతుర్ పెట్టాయ్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న 53 ఏళ్ల ఈపీ గణేశన్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. అయితే తన తండ్రి పాము కాటుతో చనిపోయాడని అందరినీ నమ్మించారు ఆ ఇద్దరు కుమారులు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశన్ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అప్పటికే తన తండ్రిపై రూ. 3 కోట్ల బీమా చేయించారు కుమారులు.
ఇక గణేషన్ అంత్యక్రియల తర్వాత ఇన్సురెన్స్ డబ్బు కోసం బీమా సంస్థ వద్దకు వెళ్లగా.. గణేషన్ మృతి చెందిన విధానం.. ఆ ఇద్దరు కుమారుల ప్రవర్తన.. తదితర కారణాలతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నార్త్ జోన్ అస్రా గార్గ్ తెలిపారు. అయితే విచారణలో ఇన్సురెన్స్ డబ్బు కోసమే గణేషన్ ను ఆ ఇద్దరు కుమారులు.. పాము కాటుతో చంపించారని గుర్తించారు.

తొలి ప్లాన్ లో భాగంగా కోబ్రా పాముతో కాటు వేయించి చంపాలని గణేషన్ రూమ్ లోకి పామును వదిలారు. అయితే ఆ పాము కాటు వేయకపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. కొద్దిరోజుల తర్వాత మరో ప్లాన్ వేశారు ఇద్దరు కుమారులు. ఈసారి అత్యంత విషపూరితమైన క్రెయిట్ పామును తీసుకొచ్చారు. ఆ పాము గణేషన్ మెడపై కరిచింది. వెంటనే ఆ పామును ఇంట్లోనే చంపి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత గణేషన్ ను వెంటనే కాకుండా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఈ విషయాలు పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో భాగంగా ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications