నైరుతి బైబై?.. పసిడి నేలను పలకరించకుండానే వీడ్కోలు..

కొద్దివారాల పాటు పలకరించి కుండపోత వర్షాలతో అల్లకల్లోలం సృష్టించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు నిశ్శబ్దంగా దేశం నుంచి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన సాధారణ వర్షపాతంలో ఏకంగా 13 శాతం లోటు కనిపిస్తోంది.

వాయువ్య భారత్‌లోకి పొడిగాలులు ప్రవేశిస్తుండటంతో రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియకు ప్రాథమిక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇకపై వర్షాలు పడటం బెంగాల్ ఖాతాలో ఏర్పడే కొత్త అల్పపీడనాలపైనే ఆధారపడి ఉంటుంది.

Southwest Monsoon Withdrawal Begins India Rainfall Deficit Stands at 13 Percent as Dry Winds Enter North

ఉత్తరాది నుంచి తూర్పు వరకు.. ఎండిపోతున్న పొలాలు!

ఈ ఏడాది వర్షాల సరళి దేశమంతటా తీవ్ర అసమానంగా సాగింది. పశ్చిమ, మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు సాధారణ వర్షపాతాన్ని సాధించినప్పటికీ.. ఇండో-గాంగేటిక్ మైదానాలు, ఈశాన్య రాష్ట్రాలు , దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు గణనీయంగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చల్లటి పొడిగాలుల రాకతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, మేఘాల నిర్మాణం తగ్గిపోవడంతో సాధారణ వర్షాలు కూడా పడని పరిస్థితి ఏర్పడింది.

Super El Nino: నవంబర్, డిసెంబర్‌లో పరాకాష్టకు. ప్రకృతి ప్రకోపానికి సిద్ధంగా ఉండండి..
Super El Nino: నవంబర్, డిసెంబర్‌లో పరాకాష్టకు. ప్రకృతి ప్రకోపానికి సిద్ధంగా ఉండండి..

హిమాలయాల వైపు పయనం.. సన్నగిల్లుతున్న ఆశలు!

శాటిలైట్ చిత్రాలు, వెదర్ మోడల్స్ ప్రకారం వర్షపాతాన్ని తెచ్చే రుతుపవన ద్రోణి ఇప్పుడు దక్షిణ మైదాన ప్రాంతాలను వదిలి హిమాలయ పాదాల వైపు మళ్లింది. సాధారణంగా ఇది రుతుపవనాలు బలహీనపడటానికి స్పష్టమైన సంకేతం. వర్షపాతం లోటు ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, కర్ణాటకతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పంటలకు అవసరమైన తేమ నేలలో లోపించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరిక...!!
మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరిక...!!

అల్పపీడనం వస్తేనే ఆశలు.. లేదంటే ఎండల బాట!

వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం రుతుపవనాలు వెంటనే ముగిసిపోనప్పటికీ, వాతావరణంలో మార్పులు వేగంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర, పశ్చిమ భారతదేశంలో వర్షాలు మళ్లీ పుంజుకోవాలంటే బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనాలు ఏర్పడి, అవి తేమతో కూడిన గాలులను దేశం లోపలికి లాక్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పొడి గాలుల ప్రభావమే ఎక్కువగా ఉంది. దీంతో ఈ ఏడాది వర్షాభావ లోటు పూడుతుందన్న ఆశలు దాదాపు అస్తమించినట్లేనని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+