సునంద అప్పుడు మాట్లాడలేదు!: సీనియర్ జర్నలిస్ట్ నళిని విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం శుక్రవారం నాడు ప్రముఖ జర్నలిస్ట్ నళినీ సింగ్ను విచారించింది. సునంద మృతికి ముందు తనతో ఫోన్ ద్వారా మాట్లాడారని, ఈ నేపథ్యంలో తనను ప్రశ్నించారని నళినీ తెలిపారు.
సునంద పుష్కర్ తనతో ఐపీఎల్ విషయమై మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారని నళినీ తెలిపారు. నిందలన్నీ ఆమె తన పైన వేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్ని మీడియాకు చెప్పాలనకుంటున్నారా అని తాను సునందను ప్రశ్నించినప్పుడు.. ఆమె మౌనం దాల్చిందని చెప్పారు.
న్యూఢిల్లీలోని సరోజిని నగర్ పోలీసు స్టేషన్లో నళినీ సింగ్ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారించింది. ఆమెను గంటకు పైగా విచారించింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రేమ్ నాథ్ నేతృత్వంలో ఆమెను విచారించారు.

కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు సంస్థ గురువారం నాడు పలువురు జర్నలిస్టులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునంద పుష్కర్ మృతికి ముందు ఏఏ విలేకరులతో మాట్లాడారో.. వారిని విచారించారు.
సునంద పుష్కర్ హత్య కేసు ఇటీవల ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసును చేధించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సునంద భర్త, కాంగ్రెస్ మాజీ మంత్రి శశిథరూర్ను, పలువురిని ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు మహిళా, పురుష జర్నలిస్టుల నుంచి వివరాలు సేకరించారు. సునంద పుష్కర్ చనిపోవడానికి ముందు కొందరు మహిళా జర్నలిస్టులతో ఫోన్లో మాట్లాడారు.
వారిని ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. జర్నలిస్టులు చెప్పిన విషయాలతో శశిథరూర్ చెప్పిన వివరాలను పోల్చుకోనున్నారు. మహిళా జర్నలిస్టులతో ఐపీఎల్ విషయం, లేదా పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ విషయాలు ఏమైనా చెప్పారా అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications