పతంజలి డైరీ సీఈవో సునీల్ బన్సాల్ మృతి.. కరోనా వల్లే..
కరోనా చిన్న, పెద్ద చూడటం లేదు. అందరినీ ఓకేగాటిన గట్టి మరీ అల్లాడిస్తోంది. యోగా గురువు రాం దేవ్ బాబా కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే పతంజలి డైరీస్ సీఈవో సునీల్ బన్సాల్ కూడా కరోనాతో ఇబ్బంది పడి చనిపోయారు. పతంజలీ డైరీ విభాగంలో 2018లో చేరారు. ఆవు పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, బటర్ మిల్క్, చీజ్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ నెల 19వ తేదీన బన్సాల్ చనిపోయారు. ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. బ్రెయిన్ హెమరేజ్ కూడా వచ్చింది. కరోనా వల్ల అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. కొద్దీరోజుల క్రితం బన్సాల్ ఎక్నో కూడా చేయించుకున్నారు. ఇదీ గుండె, ఊపిరితిత్తులు పనిచేయకుండా చేయించుకుంటారు. అల్లొపతి వైద్యం వల్ల లక్షలకు లక్షలు నగదు వెళుతుందే తప్ప లాభం లేదని రామ్ దేవ్ బాబా అన్నారు. 140 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. ఆ తర్వాతే బన్సాల్ చనిపోయారు.
ఐఎంఏ స్పందించింది. రాం దేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖను కోరింది. ఆరోపణలను పతంజలి కొట్టివేసింది. తర్వాత క్షమాపణ కూడా కోరింది. వైద్యులను తక్కువ చేసేలా మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి రాం దేవ్ బాబాపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఫైరయ్యారు.