హరిద్వార్ విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్-ఉత్తరాఖండ్ సర్కార్ కు నోటీసులు
హరిద్వార్ లో గత నెల 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సన్యాసులు ముస్లింలపై చేసిన విద్వేష వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరాఖండ్కు ఎస్సీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఇలాంటి సమావేశాలపై చర్యలు తీసుకునేందుకు నోడల్ అధికారులను నియమించాలని గతంలోని తీర్పుల్లో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ కేసులో పిటిషనర్లు తెలిపారు. కానీ నిర్వాహకులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదన్నారు. పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ భవిష్యత్తులో ధర్మ సంసద్లలోపు కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు.

డిసెంబరు 17 నుండి డిసెంబర్ 19 వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన మూడు రోజుల మతపరమైన సభలో మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగాలు చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు హిందూ మత పెద్దలు, ఆయుధాలు చేపట్టాలని సమాజానికి పిలుపునిచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా వారు 'హిందూ దేశం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
దీనిపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టుకు చెందిన 76 మంది న్యాయవాదులు గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. త్వరలో యూపీలో ఎన్నికలు జరిగే ఉనా, దస్నా, అలీఘడ్ లో ఇలాంటి మరిన్ని ధరమ్ సంసద్ లు జరగబోతున్నాయి. దీంతో సుప్రీంకోర్టు దీనిపై చర్యలు చేపట్టేందుకు వీలుగా నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications