ఇస్లాంకు 'సూర్య నమస్కారం' వ్యతిరేకం: లా బోర్డు
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్ధులతో 'యోగా డే' రోజున తప్పనిసరిగా ''సూర్యనమస్కారం' చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయం విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం తెలిపింది. యోగా ముస్లిం మతాచారాలకు విరుద్ధం అవుతుందని పేర్కొంది.
ప్రత్యేకించి యోగాలో భాగంగా చేసే "సూర్య నమస్కారం'' ముస్లింలు చేయకూడదని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ ఆందోళనతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదివారం సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకుంది.

యోగా విషయంలో మార్పు చేర్పులకు ప్రాధాన్యతను ఇచ్చింది. ముస్లింలకు అభ్యంతరమైన "సూర్య నమస్కారాన్ని'' పాఠశాల యోగాభ్యాసం నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. యోగా డే డ్రిల్ లో సూర్యనమస్కారం లేకుండానే విద్యార్థుల చేత యోగాను చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ 'యోగా డే'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications