మళ్లీ వార్తల్లోకి ఎక్కిన స్వామి చిన్మయానంద్: న్యాయ విద్యార్థినిని నిర్బంధించి, అత్యాచారం కేసులో..!
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవ్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. న్యాయ విద్యార్థినిని నిర్బంధించి ఏడాది కాలం పాటు అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తోన్న ఆయనకు బెయిల్ మంజూరైంది. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలను జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నవ్కు చెందిన స్వామి చిన్మయానంద్..న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం ఆయన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై నమోదైన ఆరోపణలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపితమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ షాజహాన్పూర్లోని ఎస్ఎస్ న్యాయ కళాశాల డైరెక్టర్గా వ్యవహరించిన సమయంలో చిన్మయానంద్.. తనను నిర్బంధించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అదే కళాశాలకు చెందిన బాధిత విద్యార్థిని వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే.. హత్య చేస్తారనే భయంతో ఆమె కొన్ని రోజులు అదృశ్యం అయ్యారు. ఓ వీడియో ద్వారా ఈ దురాగతాన్ని వెల్లడించారు. అప్పటి నుంచీ ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో చిన్మయానంద్పై సెక్షన్ 376 సీ, సెక్షన్ 354 డీ, సెక్షన్ 342, సెక్షన్ 506 కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన తరువాత భారతీయ జనతా పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువు కావడంతో న్యాయస్థానం గత ఏడాది నవంబర్లో జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన అలహాబాద్ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. చిన్మయానంద్కు బెయిల్ రావడం పట్ల అత్యాచార బాధితురాలి కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications