అసెంబ్లీ స్పీకర్ కారుకు ప్రమాదం -ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -మోదీ సభకు వెళ్తుండగా ఘటన
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, మంత్రి ఎస్పీ వేలుమణి కాన్వాయ్ లు ప్రమాదానికి గురయ్యాయి. ధారాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ఇద్దరు నేతల కాన్వాయ్ లు ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం సభవించింది. అతివేగంగా రెండు కార్లు గుద్దుకోవడంతో వాటిని వేరు చేసేందుకు క్రేన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం
అన్నాడీఎంకే నేత, అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ కాన్వాయ్ ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుంచి మంత్రి వేలుమణి కాన్వాయ్ వేగంగా దూసుకొచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పీకర్ కాన్వాయ్ లోని ఇన్నోవా వాహనం, మంత్రి కాన్వాయ్ లోని మరో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రమాదంలో స్పీకర్ కుగానీ, మంత్రికిగానీ ఎలాంటి గాయాలు కాలేదని, వాహనాలను నడిపిన డ్రైవర్లు ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. తొలుత స్పీకర్ ధన్ పాల్ గాయపడ్డారని మీడియాలో వార్తలు రాగా, వాటిని పోలీసులు ఖండించారు. ప్రమాదం తర్వాత స్పీకర్, మంత్రి నేరుగా ధారాపురం వెళ్లి ప్రధాని మోదీ సభలో పాల్గొన్నారు.
తిరుపతి పోరు: రత్నప్రభపై జనసైనికుల అసంతృప్తి నిజమే -ఉప సేనాని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు -పవనే సీఎం
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల 6న పోలింగ్ జరుగనుంది. అధికార అన్నాడీఎంకే.. బీజేపీతో కలిసి పోటీ చేస్తుండగా, ప్రతిపక్ష డీఎంకే.. కాంగ్రెస్, లెఫ్ట్, వీకేసీ తదితర పార్టీలతో కూటమిగా పోరాడుతున్నది.