క్లైమాక్స్: పన్నీర్ VS శశికళ: జయ స్మారకమండప నిర్మాణానికి దెబ్బ !
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఈ ఆధిపత్యపోరు దెబ్బతో అమ్మ జయలలిత స్మారక మండపానికే సమస్యగా మారింది. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి రోజున జరగవలసిన అమ్మ స్మారకమండప శంకుస్థాపన ప్రశ్నార్థకంగా మారిపోయింది.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్లంది ఓ దారి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ది ఓ దారి కావడంతో అమ్మ స్మారకమండప నిర్మాణ నమూనా చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. 2016 డిసెంబర్ 5వ తేదిన జయలలిత మరణించడంతో చెన్నైలోని మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి సమీపంలోనే సమాధి చేశారు.
ఎంజీఆర్ సమాధి సమీపంలోనే తన సమాధి ఉండాలని జయలలిత తన సన్నిహితులతో చెప్పుకునేవారు. జయలలిత సమాధి ఉన్న చోట స్మారకమండపం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రూ. 15 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
జయలలిత స్మారకమండపం నమూనా చిత్రం సిద్దం చేసే బాధ్యతను ఒక ప్రయివేటు అర్కిటెక్ట్ కు అప్పగించారు. జయలలిత స్మారకమంపడం నిర్మాణంపై సీఎం పన్నీర్ సెల్లం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అర్కిటెక్ట్ తయారు చేసిన స్మారక నమూనా చిత్రాలను ప్రజాపనుల శాఖ అధికారులు సేకరించి ఓ కాపీని సీఎంకు, మరో కాపీని శశికళకు పంపించారు.

అయితే సీఎం పన్నీర్ సెల్వం చెప్పినట్లు కాకుండా శశికళ చేసిన మార్పులతో అమ్మ స్మారకమండపం నిర్మాణం పనులు జరగాలని పోయెస్ గార్డెన్ నుంచి ప్రజాపనుల శాఖకు ఆదేశాలు అందాయి. అమ్మ స్మారకమంపడం పనులు ప్రభుత్వం కనుసన్నల్లో జరగాలని సీఎం పన్నీర్ సెల్వం గట్టిగా ఆదేశాలు జారీ చేశారు.
పన్నీర్ సెల్వం, శశికళ చెరోదారిలో ఉండటంతో అమ్మ స్మారకమండపం నమూనా చిత్రం తయారై నెలరోజులు దాటిపోయిన ఓ నిర్ణయం తీసుకోలేక ప్రజాపనుల శాఖ మధ్యలో నలిగిపోతోంది. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి రోజు అమ్మ స్మారకమండపం నిర్మాణానికి శంఖుస్థాపన చెయ్యాలని ముందే నిర్ణయించారు.
జయలలితకు ప్రీతిపాత్రమైన అంశాలను జోడించాలని సీఎం పన్నీర్ సెల్లం ఆర్కిటెక్ట్ కు సూచించారని ప్రజపనుల శాఖకు చెందిన ఓ సీనియర్ అదికారి అంటున్నారు. అయితే సీఎం మాటలు పట్టించుకోకుండా స్మారక నిర్మాణపండపం నమూనా చిత్రం తయారు చెయ్యాలని పోయెస్ గార్డెన్ నుంచి గట్టిగానే ఆదేశాలు జారీ అయ్యాయని అధికారి చెబుతున్నారు.
సీఎం పన్నీర్ సెల్లం, శశికళ మధ్య పొంతనకుదరకపోవడంతో తాము మధ్యలో నలిగిపోతున్నామని ప్రజాపనుల శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు జయలలిత స్మారకమండపం నిర్మాణ నమూనా చిత్రమే సిద్దం కాకపోవడంతో జయలలిత జయంతి రోజున శంఖుస్థాపన జరగడం ప్రశ్నార్థకంగా మారిందని ప్రజాపనుల శాఖ అధికారులు అంటున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications