Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

13మంది మృతి: స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వత మూసివేత

చెన్నై: తూత్తుకుడి ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.

కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కారణంగా స్థానికులు అనారోగ్యానికి గువుతున్నారని, వెంటనే మూసివేయాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tamil Nadu govt orders closure of Sterlite Plant in Thoothukudi

ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మే 22న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

రాజకీయ పార్టీలు ఆందోళనకారులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+