Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా అడ్డుపడినా తగ్గేదేలే.. భారత్ ఎకానమీ పైపైకి..

2025-26 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ గ్రోత్ ను సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్ పై అమెరికా టారిఫ్ లు విధించినా వాటిని తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్లినట్లు కేంద్ర ఆర్థికశాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ విభాగం ఇచ్చిన రిపోర్టులో స్పష్టమైంది. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడిందని తెలిపింది. దేశంలో అలాగే ప్రపంచంలో టారిఫ్ లు ఇతర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా వృద్దిని నమోదు చేసిందని నివేదికలో పేర్కొంది.

అమెరికా లాంటి దేశాలు భారత్ పై పన్నులు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇవే ఇప్పుడు అభివృద్ధి ఫలాలను అందించినట్లు స్పష్టం అవుతోంది. అలాగే భారత్ లో ఇటీవలి కాలంలో తీసుకొస్తున్న సంస్థాగత మార్పులు, సంస్కరణలు, పాలసీలు దేశ ప్రజలపై పాజిటివ్ విధానంలో ప్రభావం చూపుతున్నాయని దానివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసిందని నివేదికలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇటీవల జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు, దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని దీనివల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ విధానంలో దోహదపడ్డాయని తెలుస్తోంది. ప్రజల్లో స్వదేశీ వస్తువులపై డిమాండ్ ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం, మానిటరీ విధానంలో సడలింపులు, జీఎస్టీ సంస్కరణలను కొనసాగించడం.. తదితర కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో దూసుకెళ్లినట్లు స్పష్టం చేసింది రిపోర్టు.

ఇటీవల ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారత వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో ప్రొజెక్ట్ చేశాయి. భారత సేవల రంగంలో ఎగుమతులు గణనీయంగా పెరుగుదల కారణంగా భారత వాణిజ్యం దూకుడుగా సాగుతోందని వివరించింది. అలాగే భారత్ లోకి విదేశీ పట్టుబడులు కూడా పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ లోని పలు రాష్ట్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నట్లు తాజా రిపోర్టు వివరించింది.

Tariff-Proof Triumph India s Economy Accelerates in Q2 FY26 Despite US Levies Finance Ministry

జీఎస్టీ రేట్లను తగ్గించడం కారణంగా వినియోగదారులు, వ్యాపారులపై పన్నుల భారం తగ్గినట్లు పేర్కొంది. అయితే ప్రపంచ మార్కెట్లలో మాత్రం ఒడిదుడుకులు అలాగే కొనసాగుతున్నాయని అవి భారత్ పై ప్రభావం చూపకుండా ఎప్పటికప్పుడు భారత్ సంస్కరణలతో ముందుకెళ్లాలని రిపోర్టు స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+