'బిగ్ బాస్' ఆఫర్ను తిరస్కరించిన తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ బిగ్ బాస్ ఆఫర్ను తిరస్కరించింది. కలర్స్ ఛానెల్లో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షో బిగ్ బాస్ 8లో పాల్గొనమని ఆమెకు ఆహ్వానం అందింది. అయితే ఈ ఆఫర్ను తస్లీమా తిరస్కరించారు.
బిగ్ బాస్లో పాల్గొనడం ద్వారా ప్రపంచానికి తస్లీమా నస్రీన్ అంటే ఏమిటో తెలియజేయవచ్చని, దీంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తామని బిగ్ బాస్ వర్గాలు తనను సంప్రదించాయని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. అయితే దీనిని తిరస్కరించినట్టు తెలిపారు.
కాగా, ఇటీవలే కేంద్రప్రభుత్వం తస్లీమా నస్రీన్ భారత్లో నివసించేందుకు రెండు నెలల రెసిడెన్షియల్ వీసాను జారీ చేసేందుకు అంగీకరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆమె కలిశారు. తాను భారత్లో ఎక్కువకాలం ఉండేందుకు వీసా గడువు పెంచాలని మంత్రిని కోరారు.
భారత్లో నివాస అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 1 నుంచి రెండు నెలల పాటు ఉండేందుకు అనుమతించింది. అయితే, దీర్ఘకాలం ఉండేందుకు ఆమె చేసిన విజ్ఞప్తిని పెండింగ్లో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆమె రాజ్నాథ్ కలసి కోరారు. 1994లో బంగ్లాదేశ్ నుంచి స్వీయ బహిష్కరణ తర్వాత ఇండియన్ వీసా మీద 2004 నుంచి తస్లిమా ఇక్కడే ఉంటున్నారు.