టిసిఎస్ టెక్కీపై అత్యాచారం: ఆ తర్వాత హత్య

ఇద్దరు భవన నిర్మాణ కూలీలే టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్కు చెదినవారు చెందినవారు. టెక్కీ హత్య జరిగిన తర్వాత సంఘటనకు సమీపంలో ఉన్న భవన నిర్మాణానికి ఇద్దరు కూలీలు రావడంలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్యోదంతం గురించి వారు వివరించారు.
ఆ రోజు టెక్కీ ఉమామహేశ్వరి రాత్రి పొద్దుపోయాక 10 గంటల ప్రాంతంలో ఒక్కతే కార్యాలయం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు కూడా సరిగా లేకపోవడంతో చీకటిగా ఉంది. ఆ స్థితిలో అక్కడే ఉన్న తామిద్దరం ఆమెను అటకాయించి, ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు వారు పోలీసు విచారణలో తెలిపారు.
అత్యాచారం చేసిన అనంతరం ఆమె పొట్టపైనా, మెడపైనా గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఫిబ్రవరి 22న గుర్తు తెలియని శవంగా తొలుత భావించినా అది టెక్కీదేనని తేలడంతో నిందితుల కోసం వేట సాగించారు. ఎట్టకేలకు కూలీలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. దీంతో సిప్కాట్ వద్ద భద్రతను పెంచారు.












Click it and Unblock the Notifications