భార్యాపిల్లలున్నారు, వక్రబుద్ధి: టెక్కీని కట్టేసి చితగ్గొట్టారు
బెంగళూరు: యువతి పట్ల తన వక్రబుద్ధిని ప్రదర్శించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరును స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేసి, చిత్తుగా కొట్టారు. దుస్తులు చిరిగిపోయేలా కొట్టారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆ టెక్కీ యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
నిందితుడు వివాహితుడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిందితుడు తనను ఉద్దేశిస్తూ అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు ఆరోపించింది. శనివారం తన భర్తతో కలిసి వచ్చి టెక్కీని నిలదీసింది. అక్కడున్న స్థానికులకు విషయం చెప్పింది.

దాంతో స్థానికులు అతన్ని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications