పాలు తెస్తానని చెప్పి శవమైన సాప్ట్వేర్ ఇంజనీర్
మంగుళూరుకి చెందిన కనిష్క్ పుట్టిగె పంప్రీలోని టాటా టెక్నాలజీస్ ఉద్యోగం చేస్తున్నాడు. పంప్రీలోని కో ఆపరేటివ్ సొసైటీ నుండి రెండు వారాల ముందే మోషీలోని ప్రాధీకరణ్ అపార్ట్ మెంట్లోకి మారాడు. అతనిపాటు నాయనమ్మ లీలావతి అదే ఇంట్లో నివాసం ఉంటుంది. తన మనవడి మరణవార్త వినగానే ఆమె నిశ్చేష్టురాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
కనిష్క్ పుట్టిగె ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోసారీ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కెఎల్ పవార్ మాట్లాడుతూ "తన చావుకి ఎవరూ బాధ్యులు కారు" అని సూసైడ్ నోట్లో రాసి ఉందని తెలిపారు.
తాను నివసిస్తున్న బిల్డింగ్ నుంచి తొలుత ఆత్మహత్య చేసుకోవాలని భావించినా.. అది కాస్త ఎత్తు తక్కువ ఉండటంతో ప్రక్కనే ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి 8వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అంత ఎత్తు నుంచి దూకడంతో తలకు బలమైన గాయలు తగిలాయి. దాంతో అతను అక్కడికి అక్కడే చనిపోయాడని దర్యాప్తు అధికారి సంజన్ పాండే చెప్పారు. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం పింప్రీలోని యశ్వంత్రో చవాన్ మోమోరియల్ హాస్పిటల్కు ప్రైవేటు వాహనంలో తరలించారు.