ఢిల్లీలో టెన్షన్ టెన్షన్-రాహుల్ ఈడీ విచారణ-ఏఐసీసీ ఆఫీసుకు భారీగా నేతలు-పోలీసుల దిగ్బంధం
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్ల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బల ప్రదర్శనకు రాహుల్ సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ ను ఏఐసీసీ కార్యాలయానికి పీలిపించారు. వీరితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా రాహుల్ తో కలిసి ఈడీ కార్యాలయానికి సత్యాగ్రహ్ ర్యాలీ చేపట్టబోతు్న్నారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతలంతా ఇవాళ ఏఐసీసీ కార్యలయానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఏఐసీసీ ఆఫీసుకు రానున్నారు.అక్కడి నుంచి వీరంతా ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలిసులు భారీగా మోహరించారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లే అన్ని దారుల్ని మూసేసి పోలీసులు భారీగా కాపలా కాస్తున్నారు. అంతేకాదు ఏఐసీసీ కార్యలయాన్ని సైతం పూర్తిగా దిగ్బంధించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్న రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం తనను ఉద్దేశపూర్వకంగా ఈడీతో టార్గెట్ చేయిస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి పంపేందుకు వ్రయత్నిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఇవాళ సత్యాగ్రహ్ ర్యాలీలకు పిలుపునిచ్చారు. అలాగే ఢిల్లీలోనూ ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ భారీగా పోలీసులు మోహరించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications