Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ దాడుల దెబ్బతో సీఎం ఇంటికి పరుగుతీసిన కాంట్రాక్టర్ల సంఘం లీడర్స్, అక్కడే !

బెంగళూరు: కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న నేతృత్వంలోని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధి బృందం బెంగళూరులో (Bengaluru) ముఖ్యమంత్రి (CM)సిద్ధరామయ్యను ఆయన నివాస కార్యాలయంలో కలుసుకుని చర్చలు జరిపింది. కాంట్రాక్టర్ల బకాయి బిల్లులను 30 రోజుల్లోగా క్లియర్ చేయాలని లేనిపక్షంలో కాంట్రాక్టర్లు సమ్మెకు దిగుతారని శనివారం సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ముందు కెంపన్న పట్టుబట్టినట్లు తెలిసింది.

కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న మాట్లాడుతూ ఐదు ఆరు నెలల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు (Bill) పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై సీఎం సిద్దరామయ్యతో (siddaramaiah) సమావేశం నిర్వహించామని కెంపెన్న అన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారని కెంపెన్న అన్నారు. బీబీఎంపీ అధికారులు, ఇంజనీర్లు, బీబీఎంపీ (BBMP) కమిషనర్‌ కూడా ఈ సమావేశంలో ఉన్నారని కెంపెన్న అవివరించారు.

 The BBMP contractors association ran to the CM after being hit by the IT department in Bengaluru.

ఈ ఏడాదిలోగా బకాయి బిల్లులు క్లియర్ చేస్తామని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) చెప్పారని కెంపెన్న చెప్పారు. ఈ నెలలోనే 50 శాతం బిల్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశామని కెంపెన్న తెలిపారు. శుక్రవారం బెంగళూరులోని (Bengaluru) ఓ కాంట్రాక్టర్‌ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించగా లెక్కల్లో చూపని రూ 42 కోట్ల డబ్బు బయటపడింది.

బీబీఎంపీ (BBMP) కాంట్రాక్టర్ ఆర్. అంబికాపతికి చెందిన రూ. 42 కోట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కాంట్రాక్టర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్, కాంట్రాక్టర్ల సంఘం యొక్క ప్రముఖ వాయిస్, అప్పటి బీజేపీ ప్రభుత్వం సివిల్ కాంట్రాక్టర్ల నుండి 40% కమీషన్ డిమాండ్ చేస్తోందని కొన్ని నెలల క్రితం ఆరోపించారు.

 The BBMP contractors association ran to the CM after being hit by the IT department in Bengaluru.

ఈ విషయమై మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ (BJP)ఎమ్మెల్యే సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్ కర్ణాటకను ఏటీఎంగా వాడుకుంటోందని, ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీబీఎంపీ (BBMP) కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు కమీషన్లు వసూలు చేసి ఆ సొమ్మును కాంగ్రెస్‌ పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు. నిన్న జరిగిన ఐటీ రైడ్‌లో (IT Raids) ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 42 కోట్లు దోచుకున్నారని బీజేపీ (BJP)ఎమ్మెల్యే సీఎన్ అశ్వత్ నారాయణ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+