ఐటీ దాడుల దెబ్బతో సీఎం ఇంటికి పరుగుతీసిన కాంట్రాక్టర్ల సంఘం లీడర్స్, అక్కడే !
బెంగళూరు: కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న నేతృత్వంలోని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధి బృందం బెంగళూరులో (Bengaluru) ముఖ్యమంత్రి (CM)సిద్ధరామయ్యను ఆయన నివాస కార్యాలయంలో కలుసుకుని చర్చలు జరిపింది. కాంట్రాక్టర్ల బకాయి బిల్లులను 30 రోజుల్లోగా క్లియర్ చేయాలని లేనిపక్షంలో కాంట్రాక్టర్లు సమ్మెకు దిగుతారని శనివారం సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ముందు కెంపన్న పట్టుబట్టినట్లు తెలిసింది.
కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న మాట్లాడుతూ ఐదు ఆరు నెలల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు (Bill) పెండింగ్లో ఉన్నాయని, దీనిపై సీఎం సిద్దరామయ్యతో (siddaramaiah) సమావేశం నిర్వహించామని కెంపెన్న అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారని కెంపెన్న అన్నారు. బీబీఎంపీ అధికారులు, ఇంజనీర్లు, బీబీఎంపీ (BBMP) కమిషనర్ కూడా ఈ సమావేశంలో ఉన్నారని కెంపెన్న అవివరించారు.

ఈ ఏడాదిలోగా బకాయి బిల్లులు క్లియర్ చేస్తామని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) చెప్పారని కెంపెన్న చెప్పారు. ఈ నెలలోనే 50 శాతం బిల్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశామని కెంపెన్న తెలిపారు. శుక్రవారం బెంగళూరులోని (Bengaluru) ఓ కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించగా లెక్కల్లో చూపని రూ 42 కోట్ల డబ్బు బయటపడింది.
బీబీఎంపీ (BBMP) కాంట్రాక్టర్ ఆర్. అంబికాపతికి చెందిన రూ. 42 కోట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కాంట్రాక్టర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్, కాంట్రాక్టర్ల సంఘం యొక్క ప్రముఖ వాయిస్, అప్పటి బీజేపీ ప్రభుత్వం సివిల్ కాంట్రాక్టర్ల నుండి 40% కమీషన్ డిమాండ్ చేస్తోందని కొన్ని నెలల క్రితం ఆరోపించారు.

ఈ విషయమై మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ (BJP)ఎమ్మెల్యే సీఎన్ అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటకను ఏటీఎంగా వాడుకుంటోందని, ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీబీఎంపీ (BBMP) కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు కమీషన్లు వసూలు చేసి ఆ సొమ్మును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు. నిన్న జరిగిన ఐటీ రైడ్లో (IT Raids) ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 42 కోట్లు దోచుకున్నారని బీజేపీ (BJP)ఎమ్మెల్యే సీఎన్ అశ్వత్ నారాయణ తెలిపారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications