Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లకలకలక, ఎలుకలు పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు, రైల్వే లీలలు!

చెన్నై: ప్రయాణికులకు ఎలుకలతో వస్తున్న ఇబ్బందులను అరికట్టడానికి రైల్వే శాఖ అధికారులు భారీ మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర చర్చకు తెరలేపారు. ఒక్క ఎలుకను పట్టుకోవడానికి సరాసరి రూ. 22, 300 ఖర్చు చేశారు. మొత్తం ఎలుకలను పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు చేసిన రైల్వే శాఖ అధికారులు తీవ్ర చర్చకు దారి తీశారు. ఆర్ టీఐ సమాచారంతో రైల్వే అధికారులు చేసిన ఈ పని వివరాలు బయటకు రావడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు..

చెన్నై రైల్వే విభాగంలో అనేక రైళ్లలోని బోగీల్లో ఎలకతో ప్రయాణికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే శాఖ అధికారులు అంటున్నారు. 2016 మే నుంచి 2019 ఎఫ్రిల్ వరకు పలు భోగీల్లో ఎలుకలను పట్టుకోవడానికి రైల్వే శాఖ అధికారులు రూ. 5. 89 కోట్లు ఖర్చు పెట్టారు.

 the Chennai division of Indian Railways have spent a whopping Rs 5.89 crore to tackle rat menace

2018-19లో మొత్తం 2,636 ఎలుకలు బోనులో పడ్డాయి. 1, 715 ఎలుకలు చెన్నై సెంట్రల్, చెంగలపట్టు, తాంబరమ్, జోళార్ పేట్ జంక్షన్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో ఎలుకలను బోనులో పట్టుకున్నారు. రైల్వే కోచింగ్ స్టేషన్ లో 921 ఎలుకలను పట్టుకున్నారని ఆర్ టీఐ సమాచారంలో వెలుగు చూసింది.

ఆర్ టీఐ సమాచారం మేరకు ఒక్క ఎలుకను పట్టుకోవడానికి సుమారు రూ. 22, 334 ఖర్చు చేశారని వెలుగు చూసింది. ఎలుకలను పట్టుకోవడానికి ఎందుకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేశారని కొన్ని మీడియా సంస్థలు చెన్నై రైల్వే స్టేషన్ సీపీఆర్ ఓ ధనంజయ్, సీనియర్ పీఆర్ ఓ ఓం ప్రకాష్ ను వివరణ కోరాయి.

అయితే ఇద్దరు అధికారులు ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తం మీద ఆర్ టీఐ సమాచారంతో ఎలుకలను పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు చేశారని వెలుగు చూడటంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+