మంత్రికి నో ఎంట్రీ చెప్పిన సుప్రీం కోర్టు, తహసిల్దార్, ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ?
బెంగళూరు/దారవాడ: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం జెండా ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రెండు విడతల్లో ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సొంత నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఎమ్మెల్యే కావడం, తరువాత మంత్రి కూడా అయిన నాయకుడి అనుచరులు రెచ్చిపోతున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ధారవాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వినయ్ కులకర్ణి నియోజక వర్గంలో లేకపోవడంతో అధికారులు, ఏజెంట్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ధారవాడ తహశీల్దార్ కార్యాలయంలో ఏ పని చేయాలన్నా అధికారుల చేతులు తడపాలని, లంచాలు ఇవ్వనిదే ఎవ్వరు ఏ పని చెయ్యడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పనులు చేయించి డబ్బులు అందుకున్న ఏజెంట్లకు లంచాలు ఇవ్వలేని రైతులు సహనం కోల్పోయి కొట్టడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలోనే మంత్రి అనుచరులను రైతలు కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. పహాణీ లేఖలో ప్రభుత్వం నమోదు చేసిన దృష్ట్యా ధారవాడ తాలూకాలోని శిబరగట్టి రైతులు మంత్రి వినయ్ కులకర్ణితో పాటు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదులు చేసినా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అధికారులు చేతులు దులుపుకుంటేనే పనులు జరుగుతున్నాయని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తహసిల్దార్ రమేష్ బండి ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్న రైతులు అదే తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ రమేష్ బండిని నిలదీశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వకపోవడమే దీనంతటికీ కారణమని తహసిల్దార్ ఆరోపిస్తున్నారు. తహసిల్దార్ రమేష్ బండి ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నాడని, ఎవరూ చెప్పినా మాట వినడం లేదని రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. ధారవాడ రైతులు ఏకంగా మంత్రి వినయ్ కులకర్ణి మీద ఆరోపణలు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

వాణిజ్య నగరమైన హుబ్బళిలోని గదగ్ రోడ్డు వెంబడి అక్రమంగా నిర్వహిస్తున్న 23 దాబా దుకాణాలను కార్పొరేషన్ అధికారులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. 25 మంది కార్మికులు రెండు జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దుకాణాలను తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు, నాలుగేళ్లుగా కొందరు రోడ్డు పక్కన ఫుట్పాత్పై దాబా దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఖాళీ చేయాలని ఎన్నిసార్లు సూచించినా వినలేదు. ఈ నేపథ్యంలో జోన్ ఆఫీస్ 6 అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించినట్లు కార్పొరేషన్ ప్రజాసంబంధాల అధికారి ఎస్.సి. బేవూరు సమాచారం అందించారు. కార్పొరేషన్ డెవలప్మెంట్ అధికారులు, ఇంజినీర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
-
దేశంలోనే టాప్ లో ఏపీలో అన్నదాతల అప్పులు.. కేంద్రం లెక్క ఇదే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications