రాజకీయ నాయకులను చంపేయాలి: జడ్జి సంచలనం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యయమూర్తి ఎస్ఎన్ దింగ్రా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్పై దాడికి పాల్పడిన కేసులో ఉరిశిక్ష పడిన అప్జల్ గురుకు మద్దతు పలికే రాజకీయ నాయకులను చంపేయాలని అన్నారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) గొడవల నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2002లో పార్లమెంటుపై దాడికి పాల్పడి 15 మంది మృతికి కారణమైన వ్యక్తి బలిదానం చేశాడంటూ సంతాప వ్యక్తం చేయడం సరైన పనా..? అంటూ ప్రశ్నించారు.
అప్జల్ గురుకి ఉరిశిక్ష విధించడం ‘జ్యుడిషియల్ క్లిలింగ్' అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సమాజానికి హితం చేసే వ్యక్తులను శిక్షించే హక్కు న్యాయస్థానాలకు ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని ప్రశ్నించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని అన్నారు.

అఫ్జల్గురుని ఉరితీసిన రోజును సంతాపం దినంగా వ్యవహరిస్తూ జెఎన్యూలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించడాన్ని తీవ్రంగా స్పందించారు. జెఎన్యూ విద్యార్ధులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను కూడా వదలకూడదని దింగ్రా అభిప్రాయపడ్డారు.
జెఎన్యూలో అప్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని, దీంతో జెఎన్యూలోని ఏడుగురు విద్యార్ధులపై దేశద్రోహం నేరం కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నయ్య కుమార్ను అరెస్ట్ చేసి ఢిల్లీ హైకోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.
ఇటీవల కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు పార్లమెంటుపైదాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్గురుకు ఉరిశిక్ష విధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పీ చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అఫ్జల్గురుకు మరణశిక్షపై కోర్టు తీసుకున్న నిర్ణయం సరైని కాదని అన్నారు. పార్లమెంటుపై దాడిలో అఫ్జల్గురు ప్రమేయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. జేఎన్యూ విద్యార్థులపై దేశద్రేహం అభియోగాలుమోపడం దారుణమని కూడా అన్నారు.
-
తండ్రితో ఇష్యూ.. నాలుగేళ్ల బాలుడిని నేలకేసి విసిరికొడుతూ దాడి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!











Click it and Unblock the Notifications