ఘోరం: లాడ్జీలో ఫ్రెండ్స్తో కలిసి ప్రియురాలిపై గ్యాంగ్రేప్
చెన్నై: తమిళనాడులోని నాగర్కోయిల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియురాలిపైనే స్నేహితులతో అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కోవిల్లోని ఓ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్టోబర్ 13 నుంచి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలించగా ఆమె లాడ్జిలో నిర్బంధించబడి ఉన్నట్లు కనుగొన్నారు.
ఆ విద్యార్థినిని మాయమాటలతో లాడ్జీకి తరలించిన ఆమె ప్రియుడు సురేశ్ అలియాస్ బ్రిజేష్.. ఆమెపై అత్యాచారం జరిపాడని పోలీసులు జరిపిన విచారణలో తేలింది. అంతేగాక, ఆ తర్వాత స్నేహితులు గోపాల్, దినేశ్, జ్ఞానప్రవీణ్ అనే ముగ్గురిని పిలిపించి వారితో అఘాయిత్యాన్ని చేయించాడని చెప్పారు.
అనంతరం అక్కడ్నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేష్, దినేష్, గోపాల్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న జ్ఞాన ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.