సాధ్వీ నిరంజన్ జ్యోతి గొడవ: విపక్షాల రాజీ ఫార్ములా
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై కొనసాగుతున్న పార్లమెంటు స్తంభనకు స్వస్తి చెప్పేందుకు ప్రతిపక్షాలు రాజీ ఫార్ములాతో ముందుకు వచ్చినట్లు సమాచారం. నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో తీవ్రంగా పట్టారు. నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పినందున ఆ విషయాన్ని వదిలేయాలని మోడీ చేసిన విజ్ఞప్తితో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు.
జ్యోతిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని పట్టుబడుతూ పార్లమెంటు కార్యక్రమాలను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. ఈ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడింది. తగిన బలం లేని రాజ్యసభలో ప్రభుత్వం మరింతగా సమస్యను ఎదుర్కుంటోంది. ఈ స్థితిలో ప్రతిపక్షాలు ఓ రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చినట్లు సమాచారం.

పేరును చేర్చకుండా నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలను ఖండిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం చేయాలనే రాజీ ఫార్ములాతో ప్రతిపక్షాలు ముందుకు వచ్చాయి. అయితే, గతంలో సోనియా గాంధీ నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యతో సహా ఇతర నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కూడా తీర్మానంలో చేర్చాలని ప్రభుత్వం అడుగుతోంది.
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి నిరంజన్ జ్యోతిని పంపించకూడదని బిజెపి నాయకత్వం నిర్ణయించుకుంది. సోమవారం నుంచి రాజ్యసభలో కార్యక్రమాలు స్తంభిస్తూ వస్తున్నాయి. క్షమాపణ చెప్పారంటే తప్పు చేసినట్లేనని, ఆ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, ఇక మంత్రిగా ఆమె ఎలా కొనసాగుతారని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ జ్యోతి మంగళవారంనాడు క్షమాపణ చెప్పారు. రాముడి సంతానానికి చెందిన ప్రభుత్వం కావాలో, అక్రమ సంతానం ప్రభుత్వం కావాలో ఢిల్లీ ప్రజలు తేల్చుకోవాలని సాధ్వీ నిరంజన్ జ్యోతి ఆదివారంనాడు ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో అన్నారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications