Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయనుంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు పట్టాలెక్కాయి.

తాజాగా మరో వందే భారత్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై-కోయంబత్తూరు మధ్య దీన్ని నడిపించనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. వందే భారత్ సిరీస్ లో ఇది 11వ ఎక్స్ ప్రెస్ అవుతుంది. గురువారం ట్రయల్ రన్ ఆరంభం కానుంది. దీనికోసం దక్షిణ రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. సాంకేతికంగా అన్నింటినీ పరీక్షించారు.

 Trial Run of Vande Bharat Express on Chennai-Coimbatore planned on March 30

గురువారం తెల్లవారు జామున 5:40 నిమిషాలకు చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరుకు బయలుదేరుతుంది ఈ ఎక్స్‌ప్రెస్. ఉదయం 11:40 నిమిషాలకు కోయంబత్తూరుకు చేరుకుంటుంది. మార్గమధ్యలో జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ లల్లో మాత్రమే ఈ ఎక్స్‌ప్రెస్ కు హాల్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు వల్ల ప్రయాణికులకు చెన్నై-కోయంబత్తూరు మధ్య ఆరు గంటల్లో రాకపోకలు సాగించే వెసలుబాటు లభించినట్టవుతుందని చెప్పారు.

ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- ఇప్పటికే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే అన్ని రైల్వే జోన్లలోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ల సంఖ్యను పెంచుతోంది కేంద్రం. చివరిగా ముంబై- సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్ మధ్య ఈ రైళ్లు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రెండు రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

16 బోగీలు ఉండే ఈ సెమీ హైస్పీడ్ రైలు సీట్ల సామర్థ్యం 1,128. గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్దితో సమానంగా పరుగులు తీయగలదీ రైలు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హాట్‌స్పాట్ వైఫై కనెక్షన్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రొటేటింగ్ ఛైర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి బోగీకీ నాలుగు అత్యవసర ద్వారాలను అమర్చారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+