రేప్ వ్యాఖ్యలు: తపస్ పాల్ సేఫ్, క్షమాపణలతో సరి
కోల్కతా: రాజకీయ ప్రత్యర్థుల మహిళలలపై అత్యాచారాలకు తమ కార్యకర్తలను పంపిస్తానని వ్యాఖ్యలు చేసిన పార్టీ పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్పై తృణమూల్ కాంగ్రెసు ఏ విధమైన చర్యలు తీసుకోకూడదని నిర్ణయించుకుంది. తపస్ పాల్ బేషరతుగా చెప్పిన బహిరంగ క్షమాపణలను అంగీకరించి, దానితో సరిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
సరైన స్ఫూర్తితో ఉన్నందున తపస్ పాల్ క్షమాపణలను అంగీకరించామని తృణమూల్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, తపస్ పాల్పై సూమోటోగా కేసు నమోదు చేసి, పీనల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారంనాడు కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

హైకోర్టులో సమిత్ సన్యాల్ అనే వ్యక్తి ఆ పిల్ దాఖలు చేశారు. పోలీసులు సూమోటాగా కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును అర్థించారు. బేషరతుగా క్షమాపణ చెబుతూ తపస్ పాల్ మీడియాకు, పార్టీకి లేఖ రాశారు.
2014 లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ సంఘటన చోటు చేసుకుందని తపస్ పాల్ తన క్షమాపణ లేఖలో చెప్పారని సన్యాల్ తరఫున కోర్టులో వాదిస్తున్న సుబ్రతా ముఖోపాధ్యాయ అన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications