విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ అప్పుడే!.. భారీ అంచనాలు, తీరేనా హామీలు?

Tamil Nadu Budget: తమిళనాడులోని దళపతి విజయ్ సర్కారు ఆగస్టు 5న తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై తమిళనాడు ప్రజలకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు చేసిన కొన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్.మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆయన వెల్లడించారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆగస్టు 6న వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ విడిగా ప్రవేశపెట్టనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత టీవీకే ప్రభుత్వానికి ఇదే తొలి బడ్జెట్ కావడంతో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.

విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలు, వ్యయ ప్రణాళికలు, విధానపరమైన కార్యక్రమాలను వివరిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను ఎలా పరిష్కరించాలనుకుంటుందో కూడా స్పష్టం చేస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ రూ.3.44 లక్షల కోట్ల రెవెన్యూ వసూళ్లను, రూ.3.93 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయాన్ని అంచనా వేయగా.. ఫలితంగా రూ.48,697 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది.

TVK Government First Budget on August 5th amidist Tamilnadu Financial Challenges and Key Promises

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన టీవీకే ప్రభుత్వం
రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీకే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత సవాలుగా ఉందని పేర్కొంది. ద్రవ్యలోటు రూ.1.22 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. శ్వేతపత్రం ప్రకారం.. తమిళనాడు మొత్తం బకాయిల అప్పు రూ.13.18 లక్షల కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని పెంచుతోంది. మధ్యంతర బడ్జెట్లో రూ.48,697 కోట్లుగా అంచనా వేయబడిన రెవెన్యూ లోటు.. సుమారుగా రూ.90,500 కోట్లకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ద్రవ్యలోటు కూడా సుమారుగా రూ.1.64 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.

గరిష్ట రుణ సామర్థ్యం రూ.1.52 లక్షల కోట్లు
రాష్ట్ర గరిష్ట రుణ సామర్థ్యం రూ.1.52 లక్షల కోట్లుగా అంచనా వేయబడిందని కూడా నివేదిక పేర్కొంది. దాని ఫలితంగా సుమారు రూ.11,600 కోట్ల ద్రవ్య లోటు ఏర్పడవచ్చు. ఈ సమయంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ద్రవ్య లోటును ఎలా తగ్గిస్తుందనే దానిపై ప్రభుత్వం స్పష్టతను ఇస్తుందని, అలాగే సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, మూలధన వ్యయాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+