అరబిందో ఆశ్రమం: ఆత్మహత్య చేసుకోబోతే రేప్, ఇద్దరి అరెస్ట్
పుదుచ్చేరి: ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రంలో దూకి స్పృహ కోల్పోయిన 40 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను పుదుచ్చేరి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని ఎస్ రాజా(35), కే విజయ్కుమార్(32)గా గుర్తించారు.
ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన పీతల వేటగాళ్లు. డిసెంబర్ 18న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలితో సహా ఆమె ఇద్దరి చెల్లెళ్లను శ్రీ అరబిందో ఆశ్రమం నుంచి పోలీసులు తరలించారు. దీంతో తల్లిదండ్రుల తోసహా అక్కాచెల్లెళ్లు సముద్రంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
బాధితురాలితోసహా ఆమె సోదరిలు వేర్వేరు ప్రాంతాల్లో స్పృహలేని స్థితిలో తీరాలకు కొట్టుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొట్టుకొచ్చిన బాధితురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
కలాపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగిన రోజు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఇద్దర్నీ సీసీటీవీ వీడియోల్లో పసిగట్టిన పోలీసులు అనంతరం వాళ్లను అరెస్టు చేశారు.